మన దేశంలో ట్రాఫిక్ అంటే కీకారణ్యమే.. చెప్పేందుకే నీతులు అన్నట్టు ట్రాఫిక్ రూల్స్ ఎన్ని ఉన్నా ఆచరించడంలో , పౌరులు, పోలీసులు, అధికారులు, నాయకులవరకూ అందరూ దఫాలు రూల్స్ బ్రేక్ చేసిన వారే.. ట్రాఫిక్ పెరుగుతున్నా , ఆక్రమణలు తొలగించలేని అసహాయత , ఇరుకైన రోడ్లు, వాహనాలకు అనుగుణంగా లేని రోడ్లు.. లంచగొండితనం, నిర్లక్ష్యం ఇవన్నీ కలిపి మనదేశంలో ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసాయి. బెంగుళూరు, హైదరాబాద్, ముంబై ..ఇలా అనేక నగరాలు , పట్టణాలు ట్రాఫిక్ కీకారణ్యాలే. మీకో విష్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద 2024 సంవత్సరంలో 12 వేల కోట్ల రూపాయలు ఫైన్స్ వేశారు.. ఇది పచ్చినిజం.. నమ్మలేని సత్యం. ఎనిమిది కోట్ల చలానాలకు సంబంధించి ఈ ఫైన్స్ వేశారు. అంటే పోలీసులు 8 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పెట్టారు. లెక్కలోలేనివి ఇంతకూ పదింతలు ఉంటాయి.
అయితే 12 వేలకోట్ల జరీమానాలో వసూలైంది ఎంతో తెలుసా..? మూడు వేలకోట్లు రూపాయలు.. మిగిలిన 9 వేలకోట్లు వసూలు కావాల్సివుంది.. ట్రాఫిక్ ఉల్లంఘన కింద వేసిన 12 వేలకోట్ల రూపాయల జరీమానా ఒక చిన్న దేశంలో జాతీయోత్పత్తితో సమానం.. దీన్ని బట్టి మన నగరాలలో రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ పరిస్థితి ఎంత అస్తవ్యస్తమో స్పష్టం అవుతొంది..

