22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

సముద్రంలో భూకంపం ప్రభావం ఎంత ?

శుక్రవారం నాడు మయన్మార్ , థాయిలాండ్ దేశాలని కదిలించిన భూకంపం ప్రభావం సముద్రంలోకి ఎంతన్న విషయాన్ని పరిశోధిస్తున్నారు. బ్యాంకాక్ , మయన్మార్ ప్రాంతాల్లో బహుళఅంతస్తుల భవనాలను కదిలించి , కూలదోసిన భూకంపం ప్రభావం భూమిమీదే ఆగిందా లేక సముద్రం అడుగుబాగంలోకి పోయిందా అనే విషయాన్ని సముద్ర గర్భ శాస్త్రజ్ఞులు నిశితంగా పరిశోదిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదు అయిన ఈ భూకంపం చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. అమెరికాలోని జియోలాజికల్, ఓషియానాలజీ సర్వే నివేదిక ప్రకారం రెండు డఫాలుగా ఈ భూకంపం ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్ పై 7.7 నమోదు అయినట్టు , రెండో దఫా నిమిషాల వ్యవధిలో 6.4గా నమోదు అయినట్టు తేలింది.

2004లో భీకరమైన సునామి ఆసియా దేశాలను సర్వనాశనం చేసింది. దాని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది . సముద్ర గర్భంలో వచ్చే ఆ భూకంపం సముద్రాన్ని ఉప్పొంగేటట్టు చేసి దాదాపు 12 దేశాలలో వినాశనాన్ని సృష్టించింది . సునామీ లోనే రెండు రకాలు ఉంటాయి . ఒకటి సముద్ర గర్భంలో వచ్చే భూకంపమే సునామీ , ఇది సముద్రాన్ని ఉప్పొంగేటట్టు చేస్తుంది. రెండోది కూడా భూకంపం లాంటి సునామినే . ఇది నీటిని వెనక్కు తీసుకుని కలిగించే వినాశనం. ఈ రెండు ప్రమాదకరమైనవి. ఇప్పుడు వచ్చిన ఈ భూకంపం సముద్రంలో ఎంత ప్రభావం చూపిందన్న విషయాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు దీని ప్రభావం సముద్రం అడుగు భాగం వరకు పోలేదని నిర్థారించారు. ముక్కు తప్ప భూమి మీద వచ్చే ఈ భూకంపాలు సముద్రంలో కూడా వ్యాపించే అవకాశం ఉంది తీర ప్రాంతాల ద్వారా జరిగే పరిణామాన్ని ఇప్పుడు దాని ప్రమాదం తప్పిందని పేల్చారు

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.