కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దేశం మొత్తం ప్రధానమైన పట్టణాలలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు.. ప్రజలకు కూడా మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు . దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని 14వ ప్రాంతాలను హై అలర్ట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి . ఆయా ప్రాంతాలకు ఆక్టోపస్ బృందాలు రక్షణ కోసం వెళ్తాయి. అదనంగా అక్కడ భద్రత కల్పిస్తారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ జోన్స్ ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ తిరుమల మరియు అలిపిరి తిరుపతి విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ హైదరాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ , నాంపల్లి హైదరాబాద్ ,మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్, ట్యాంక్ బండ్, విశాఖపట్నం జగదాంబ జంక్షన్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ ఎంజీ రోడ్డు ఈ ప్రాంతాల్లో సెక్యూరిటీ అప్రమత్తం చేసారు.
ఈ ప్రాంతాలకు పౌరులు అనవసరంగా పోవద్దని ,అవసరమైతేనే ఈ ప్రాంతాలకు పర్యటించాలని కేంద్రం సలహా ఇచ్చింది . ఈ ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటించాలనుకున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప ఆ ప్రాంతాలకు పోవద్దని ,ఒకవేళ ఆ ప్రాంతాల్లో తిరిగినా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

