22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

అదీ సంగతి., డబ్బులిస్తే ఏమైనా చేస్తారా ?

సెలెబ్రిటీలు బెట్టింగ్ రాయుళ్ల సరసన చేరారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కింద హీరో విజయ్ దేవరకొండతోసహా అందరిపై కేసులు నమోదు చేసారు. నిందితుల జాబితాలో వైసిపి అధికార ప్రతినిధి , ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి యాంకర్ శ్యామల కూడా ఉంది. బెట్టింగ్ వల్ల పదుల సంఖ్యలో యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు మొత్తం 29 మంది సెలెబ్రిటీలపై పోలీసులు కేసులు బుక్ చేసారు.

వీరిలో మంచు లక్ష్మి, దగ్గుబాటి రానా , అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ , శ్రీముఖి , నిధిఅగర్వాల్ ఉన్నారు. వీరందరిపై ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపనుంది. సినిమా సెలెబ్రిటీలు కాక టివి యాంకర్లు , నటులు కూడా ఈ రక్తపు కూటికి ఆశపడి ప్రమోషన్లు చేసిన వారే. వారిలో భయ్యా సన్నీయాదవ్, శోభాశెట్టి., రీతూచౌదరి, సిరి హనుమంతు, నేహాపఠాన్, నయనిపావని, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, విష్ణుప్రియ, హర్షసాయి, బండారు సుప్రీత , అమృతాచౌదరి, పండు, పద్మావతి, తదితరులు ఉన్నారు.

నిషేదిత యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ వీరంతా డబ్బులకు కక్కుర్తి పది ప్రమోషన్ చేసినట్టు నిరాదరణ అయింది. వీరందరి మీద బీఎన్ఎస్ లోని 318(4), 112,/ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3, మరియు 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008 లోని 66 (డి )సెక్షన్ల కింద కేసు నమోదైంది. విచారణ తరువాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.