22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

వైఎస్ గొడ్డలి కేసులో మరో సాక్షి పరలోకానికి.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు వరుస మరణాలతో సిబిఐ దిక్కుతోచని స్థితిలో పడింది. విచారణ మందకొడిగా సాగుతొందని ఒక పక్క వైఎస్ సునీత చెబుతుండగా , మరో పక్క ఒకరొకరుగా సాక్షులు చనిపోవడం వింతగా ఉంది. దీని వెనుక మిస్టరీ కూడా ఛేదించలేని పరిస్థితి. ఈ కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న తాజాగా చనిపోయాడు.

గతంలో సాక్షలుగా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి, మరో యువకుడు గంగాధరరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. మృతులు ఇద్దరూ పిన్న వయస్కులే. ఆరోగ్య సమస్యలు లేకుండా , ఒక్కసారిగా అనారోగ్యంతో చనిపోయారు. శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి కూడా ఈ కేసులో సాక్షిగా ఉంటూ మరణించాడు, అతడు కూడా విషం తాగి మరణించినట్టు పేర్కొన్నారు. ఒక హత్యకేసులో సాక్షులుగా ఉన్నవారు ఇలా చనిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.