గ్రహణ గడియలు ముంచుకొస్తున్నాయి. అంతేకాకుండా ఆకాశంలో అద్భుత దృశ్యం అందరికీ కనువిందు చేయనుంది. బ్లడ్మూన్గా పిలిచే ఈ తరహా చంద్రగ్రహణం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇకపై ఎప్పుడు చూస్తామో కూడా ఊహించలేమంటున్నారు సైంటిస్టులు.. అసలు ఈ బ్లడ్ మూన్ స్పెషాలిటీ ఏంటి.. ఎన్ని గంటలకు చూడొచ్చు?
ఈరోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు.. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి.. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్గా 85శాతం మంది చూసే అవకాశం ఉంటుంది.
బ్లడ్మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుందంటున్నారు. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని, 11..41కి చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడంటున్నారు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు.
చందమామ పూర్తి ఎర్రరంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్యే అంటున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు.ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్మూన్ని స్పష్టంగా చూడొచ్చని, ఇది సురక్షితం అంటున్నారు. మొత్తంగా రేపటి బ్లడ్మూన్ ఖగోళ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

