22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్

రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో వైసిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారు. ఈ మేరకు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ పై కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు.సమాచారం ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచే అంశంపై కాసేపట్లో నిర్ణయం.తీసుకోనున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా చేర్చారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాకముందు ఉన్న మద్యం పాలసీని జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చి , ప్రభుత్వమే నేరుగా మద్యం షాపులు తెరిచింది.

అప్పటివరకు ఉన్న బ్రాండెడ్ మద్యంని ఆపేసింది. అస్మదీయులకు స్వంతంగా డిస్టలరీస్ లీజుకు ఇప్పించి చీప్ లిక్కర్ తయారీకి పూనుకుంది. ఇదికాకుండా డిజిటల్ చెల్లింపులు ఆపేసి, నేరుగా డబ్బుతీసుకునే పనికి శ్రీకారం చుట్టింది. ఈ విధానమే ప్రజల్లో తీవ్రమైన అనుమానాలకు మొదటినుంచి కారణమైంది.

ఈ లావాదేవీల్లో 3 వేల కోట్లకు పైగా కమీషన్లు చేతులు మారాయని , అవి చివరలో మిదున్ రెడ్డికే చేరాయని , ఆయనే వాటిని చేరాల్సిన వ్యక్తికీ , సూట్ కేస్ కంపెనీలు ద్వారా చేర్చారని, ముంబైలో 450 కోట్ల విలువైన డబ్బు బంగారం వ్యాపారులద్వారా కూడా దారిమళ్లించారని చెబుతున్నారు.. ఈ కేసులో బెయిల్ కోసం మిదున్ రెడ్డి అన్ని విధాలా ప్రయత్నం చేసి, చివరకు వీలుకాక పోవడంతో అరెస్ట్ అనివార్యమైంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.