22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

అదీ జగన్ అంటే, తన రూటే వేరు..

మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలి పర్యటనపై వైసిపి నేతల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. గతంలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంఘీభావంగా , మద్దతుగా జగన్ తెనాలికి రావడమే దీనికి కారణం. ఎవరేమన్నా డోంట్ కేర్ అన్నతీరులో జగన్ పర్యటనకు రావడంతో , తెనాలికి అనుచరులు, కార్యకర్తలను సమీకరించారు. ఒక కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసుకు సంబందించిన కేసులు ముగ్గురు నిందితులకు పట్టపగలే , నడిరోడ్డులో పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు, పోలీసుల చర్యను సమర్థిస్తూ కొందరు వ్యాఖ్యలు చేసారు. అలాంటి రౌడీ షీటర్లకు ఇదే తగిన గుణపాఠమని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయారు.

తెనాలిలో హత్య, హత్యాప్రయత్నాలు, రౌడీయిజం కేసుల్లో ఈ ముగ్గురూ నిందితులే. అందువల్ల స్థానికంగా కూడా ఈ సంఘటనపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే వైసిపి మాత్రం దీన్ని ఖండిస్తూ ప్రకటన ఇచ్చింది. ఈ విషయంలో పార్టీ నాయకుల్లో కూడా పెద్ద స్పందన లేకపోవడం గమనించిన జగన్ , తానే ఈ వీడియో పోస్ట్ చేసి , ఖండన ఇచ్చాడు. దీంతో మిగిలిన వైసిపి నేతలూ ముందుకు రావాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు జగన్ తానే స్వయంగా బాధితుల పరామర్శకు తెనాలికి పోతానని చెప్పడమే కాదు, మంగళవారం ఉదయాన్నే వచ్చి, బాధితులను పరామర్శించాడు.

ఈ కేసులో బాధితులు దళితులు అని వైసిపి , చేసిన ప్రచారంతో, బాధితులూ దళితులేనని తేలడంతో దళిత కార్డు పక్కనపడేసి, ప్రజాస్వామ్యం, పోలీస్ రాజ్యం అంటూ నినాదం అందుకున్నారు. మొత్తానికి ఈ విషయంలో జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. తెనాలిలో ఎన్నో కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని, రాజకీయాలకు సంబంధంలేని అంశంలో నిందితులైన వారిని పరామర్శించి తన తెగువను నిరూపించుకున్నాడు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్.. అంటూ ముందుకు కదిలాడు.. అదీ జగన్ స్పెషల్

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.