22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

భర్తపైనే చోరీ నేరం మోపిన భార్య

తన ఇంట్లో తానే నగలు చోరీచేసి భర్తపై దొంగతనం నేరం మోపి, ప్రియుడితో లేచిపోవాలని ప్లాన్ చేసిన ఓ భార్య.. ఈ ఉదంతంలో ట్విస్ట్ ఏమిటంటే , ఆమెకు 18 ఏళ్ళ తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో కూడా సంబంధం ఉంది. ఈ నిజాలు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ముంబైలో బృహన్ ముంబై కార్పొరేషన్లో రమేష్ అనే ఉద్యోగి ఇంట్లో 10 లక్షలరూపాయలు విలువజేసే నగలు పోయాయి. ఈ మేరకు ఆయన భార్య ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పైనే అనుమానం ఉందనికూడా చెప్పింది. పోలీసులు విచారణలో ఆమె చెబుతున్న విషయాలకు పొంతనలేకపోవడంతో , అనుమానమొచ్చి దర్యాప్రును వేగం చేసారు.

ఆమె ఫోన్ లో కాల్ రికార్డ్స్ పరిశీలించారు. ఓ వ్యక్తితో తరచుగా ఫోన్ లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. మరో యువకుడు నంబర్ కూడా ఉంది. అతడితోనూ ఆమె కాంటాక్ట్ లో ఉంటుంది. ఇద్దరినీ పిలిపించి విచారించారు. తన ప్రియుడికి ఆమె నగలు ఇచ్చి , అమ్మేయమని చెప్పిందని తేలింది. నగలు అమ్మగా వచ్చిన 10 లక్షల్లో 7 లక్షలు ప్రియుడికి , మూడు లక్షలు తన కూతురు బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చిందని పోలీసు విచారణలో తేలింది.

కూతురు బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉందట. ఈ విషయం ప్రియుడికి, కూతురికి తెలియకుండా దాచిపెట్టింది. నగలు అమ్మినతరువాత , ఆ నేరం భర్తపై మోపి , అతడిని జైలుకి పంపి , ప్రియుడుతో , కూతురు బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యాలని వేసిన ప్లాన్ ఇలా బెడిసికొట్టి , ఆమెను, ప్రియుణ్ణి ,జైలుకు పంపేసింది..

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.