రానున్న పదిరోజులలో బంగాళా ఖాతంలో మరో మూడు అల్పపీడన ద్రోణులు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలుబీకురిసే అవకాశం ఉంది.

రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ,తూర్పుగోదావరి ,పశ్చిమగోదావరి , ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు

