22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

దక్షిణ మధ్య రైల్వేకు 8593 కోట్ల రెవెన్యూ

దేశంలో విమానయాన రంగం ,ఆర్టీసీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ఉంటే రైల్వేలు మాత్రం వందల, వేల కోట్ల రూపాయలు ఆదాయాలు దిశగా సూపర్ ఫాస్ట్ గా పరుగులు తీస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు దక్షిణ మధ్య రైల్వేకు 8593 కోట్ల రూపాయలు రెవెన్యూ సమకూరింది . ఇది గత అన్ని ఆదాయ వనరుల్లోకి ఎక్కువే. ఈ డివిజన్లో అధికంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల మధ్యకాలంలో దక్షిణ మధ్య రైల్వే లో 60 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేశారు. దీని ద్వారా 5634 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది . అంటే రైల్వేలో ప్రయాణికుల ట్రైన్స్ కంటే ,ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కంటే గూడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది .

గత ఏడాది ఇదే సమయంలో 8457 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ప్రయాణికులను చేరవేసే రైళ్ల ద్వారా 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ కాలంలో రెవెన్యూ వచ్చింది . ఇది కూడా గతంలో కంటే రెండు శాతం ఎక్కువ అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు నెలల్లో 11 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశారట . గూడ్స్ రవాణాలో మొదటిగా బొగ్గు , ఆ తర్వాత సిమెంటు ,ఆ తర్వాత ఇనుప ఖనిజం , ఆ తర్వాత ఎరువులు ,ఆ తర్వాత స్టీల్ ప్లాంట్స్ కు అవసరమైన ముడి సరుకు, ఆ తర్వాత ఆహార ధాన్యాలు ఆ తర్వాత ఇతరత్రా సరుకులు రవాణా జరిగాయి.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

ఈ బరువులు ఎందుకు వేలాడ తీశారో తెలుసా .?

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.