22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఐఏఎస్ శ్రీలక్ష్మికి మళ్ళీ కేసుల ఉచ్చు.

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో వైఎస్ హయాంలో ఆమె మైనింగ్ అనుమతులలో కీలకంగా వ్యవరించారు. జగన్ తో పాటే నెలలుతరబడి జైల్లో ఉండి , బెయిల్ పై బయటకొచ్చారు. తరువాత జగన్ సీఎం అయినా తరువాత మళ్ళీ కీలకంగా వ్యవరించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆమెను కేసునుంచి తప్పిస్తూ హైకోర్టు ఆదేశాలతో ఆమె యధావిధిగా ఉన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలపై , సిబిఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

నిన్ననే సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి , ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డికి, అప్పటి మైనింగ్ ఎడి, రాజగోపాల్ కి ,ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి మైనింగ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టు ఆదేశాలతో ఈ కేసులోనుంచి ఇదివరకే బయటపడ్డారు అయితే ఇప్పుడు ట్విస్ట్ ఆమెకు ఇబ్బందిగా మారింది. గతంలో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు తీర్పుని పక్కన బెట్టి, మూడునెలల్లో తాజాగా విచారణ జరిపి నివేదిక ఇవ్వమని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.