22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

గడువు తీరిన కార్లకు పెట్రోల్ పోయరు.

15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని ఢిల్లీ సర్కార్ ఆదేశం జారీ చేసింది. దీంతో పెట్రోల్ కారు కొన్న 15 ఏళ్లకు తుక్కు కింద డంపింగ్ యార్డుకు పంపాల్సిందే , లేదా ఇతర రాష్ట్రాల్లో అమ్మేసుకోవాల్సిందే. కాలుష్య నియంత్రణ , కలం తీరిన వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కారు ఓనర్లు డీలాపడి పోయారు. ఢిల్లీలో డీజిల్ వాహనాలను ప్రభుత్వం ఇదివరకే నిషేదించిన విషయం తెలిసిందే .

15 ఏళ్లకు మించిన వాహనాలకు పెట్రోల్ అమ్మకూడదని ఏప్రిల్ ఒకటి నుంచి నిబంధనలు అమలు చేయబోతున్నారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యావరణాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో కాలుష్యంతో నిండిన నగరాలలో ఢిల్లీ పదో స్థానంలో ఉంది. మన దేశంలో 10 కాలుష్య నగరాలలో మూడో స్థానంలో ఉంది. వాహనాల కాలుష్యాన్ని ముందుగా తగ్గించాలన్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయబోతున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.