22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఆపరేషన్ సిందూర్ లో పదేళ్ల శ్రావణ్.

యుద్ధ వీరులంటే మిలిటరీ దుస్తుల్లో తుపాకులు చేతపట్టి శత్రువులను తరిమికొట్టిన వారే.. ఆ పోరులో వీరమరణం పొందిన మహనీయులు.. అయితే పంజాబ్ ల్ని ఫిరోజ్ పూర్ లో ఓ పదేళ్ల బాలుడు కూడా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ లో యుద్ధవీరుడే.. అందుకే ఆ బాలుడిని ప్రత్యేకంగా మిలిటరీ అధికారి ఘనంగా సన్మానించారు. ఆ బాలుడి ధైర్య సాహసాలను ప్రశంసించాడు. చిన్న వయసులో అతడి ధైర్యానికి , దేశభక్తికి దేశం ముచ్చటపడి అక్కున చేర్చుకునే వీరుడు ఆ బాలుడు.. ఆ బాలుడి పేరు శ్రావణ్ సింగ్.. నాలుగో తరగతి చదువుతున్నాడు.

పాకిస్తాన్ సరిహద్దుల్లో కిలోమీటర్ దూరంలో ఉన్న తారావల్లీ అనే గ్రామంలో ఆ బాలుడు తల్లితండ్రులతో ఉన్నాడు. ఈ గ్రామానికి కూతవేటు దూరంలో లష్కర్ ఇ తోయిబా, జైషే ఇ మహమ్మద్ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చెయ్యాలని సైన్యం అక్కడ ఆయుధాలు, క్షిపణి లాంచర్లు పెట్టింది. శత్రు సంహారంలో , తుపాకుల హోరులో ఉన్న ఆ ప్రాంతంలో సైనికుల కోసం ప్రతిరోజూ ఈ బాలుడు , పాలు, లస్సీ, టీ , బిస్కెట్లు తీసుకెళ్లి పెట్టి వచ్చేవాడు.

ఇదేదో డబ్బులకోసం కాదు.. ఆ బాలుడిలో ఉప్పొంగిన దేశభక్తి చేయించిన సాహసం.. తన తల్లితండ్రులను అడిగి మరీ ఇలా సైన్యానికి ఆహారం తీసుకెళ్లి ఇచ్చేవాడు. ఆ బుడతడి దైర్యం మిలిటరీకి మరింత ఊపునిచ్చిందని, సన్మానం చేసిన సైనిక్ అధికారి అన్నాడు.. నాలుగు రోజుల్లో శత్రు శిబిరాలు, ఉగ్రవాద శిబిరాలను సైన్యం నేలమట్టం చేసేవరకు , ప్రతి రోజు ఈ బాలుడు ఇంటి నుంచి సైనిక స్థావరాలకు పోయి ఆకలి తీర్చి వచ్చేవాడు.. పెద్దయ్యాక సైన్యంలో చేరుతానని గర్వంగా చెబుతున్నాడు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.