22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

అంతిమయాత్రలో కాటిదాకా కన్నీటితో ఓ శునక నేస్తం

మనిషి చనిపోయిన తరువాత చితిపెట్టేవాడు కొడుకు..పాడిమోసేవాళ్ళు ఆప్తులు.. కాటిదాకా వచ్చే వాళ్ళే బంధుమిత్రులు . అయితే కొన్నిదఫాలు ఎవరూ గుర్తించని ఓ మూగ నేస్తం కూడా కాటిదాకా వస్తుంది. కడతేరిపోయిన ఆప్తుడు లేదా యజమాని కోసం దీనంగా కన్నీరు పెడుతుంది. దాన్నెవరూ ఓదార్చరు. అదే విశ్వాసానికి మారుపేరైన శునకం. నెల్లూరు జిల్లా,పొదలకూరు పట్టణంలో ఓ శునకం చనిపోయిన తన యజమాని అంత్యక్రియలలో పాల్గొనడం చూసి తెలిసిన వారు నివ్వెర పోయారు.

తెలియని వారు అడ్డంవస్తోందని తరిమేస్తున్నా , అది కాటివరకు , శవయాత్రలోనే ఉండింది. స్థానికంగా మెయిన్ రోడ్డుపై నివసిస్తున్న కాసా చలపతి అనే వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. .ఆ విషయం ఆ శునకానికి తెలిసిందో ఏమో ప్రతి రోజు తనకి ఆహారంపెట్టి, తన బాగోగులు చూసే యజమాని మరణించడంతో దిగులు పడింది. అక్కడే ఉండిపోయింది. ఇదిగో చూడండి ఈ శునకం స్మశానం వరకు వచ్చి అతనిని పూడ్చి పెట్టె వరకు అక్కేడే ఉండి అతని కుటుంబ సభ్యులు, బంధువులు,తోటి మిత్రులను అందరిని ఆశ్చర్యపరిచింది…

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.