22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

రాష్ట్రపతి పాలనకు జగన్ డిమాండ్..

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు నెలకొన్నాయని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ ముఖ్యమంత్రి ,పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు . తప్పుడు కేసులు ,అరెస్టులతో ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రాన్ని శాంతిభద్రతల విషయంలో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో రక్తం పారుతోందని అన్నారు.

వైసీపీ నాయకులను , క్రియాశీలక కార్యకర్తలను టార్గెట్ గా చేసుకొని కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు .గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే ఒక దళిత సర్పంచిని పట్టపగలే హత్య చేయించారని, ఈ సంఘటన ఒక్కటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, చట్టం ఎంతగా అదుపు తప్పిందో నిరూపిస్తుందని అన్నారు. నాగమల్లేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగలేదని ఆయన చర్యలు తమకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు.

ఈ దాడిని ఒక పద్ధతి ప్రకారం జరిపించారని ఆరోపణ చేశారు. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని ,అలాంటి వ్యక్తులు ఆ పదవిలో ఉండడానికి అర్హులు కాదని అన్నారు. రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం, శాంతి భద్రతల విషయంలో విఫలమైన ప్రభుత్వం, చట్టాన్ని ఉల్లంఘించే ప్రభుత్వం ఉండకూడదని అందువల్ల ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదో తాను ప్రశ్నిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.