స్మగ్లింగ్ లో మనోళ్లు కూడా తెలివి మీరిపోయారు. ఖర్జూరం పండ్లలో బంగారం క్యాప్సూల్స్ అక్రమరవాణా చేస్తూ ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చిక్కిపోయాడు. జెడ్డా నుంచి వచ్చిన విమానంలోని 55 ఏళ్ళ ప్రయాణీకుడు విమానాశ్రయం గ్రీన్ ఛానెల్ నుంచి బయటకు వస్తుండగా అనుమానం వచ్చింది.
దీంతో అతనివద్ద ఉన్న ఖర్జూరం చెక్ చేసారు. ఖర్జూరం కాయల మధ్యలో బంగారం పెట్టుకొని తీసుకొచ్చాడని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుక్కన బంగారం విలువ 172 గ్రాములని తేలింది.

