22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

కరెంట్ విమానం నలుగురితో ఎగిరింది..

భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత చౌక కానుంది. ఎలక్ట్రిక్‌ బైక్‌లు.విద్యుత్‌ కార్ల తరహాలోనే.. కరెంటు ఛార్జింగ్ తో ప్రయాణించే విమానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా నలుగురు ప్రయాణికులను తీసుకొని ఓ విద్యుత్‌ విమానం గాల్లోకి లేచి.సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకుంది.

ప్రస్తుత రోజుల్లో విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.అప్పుడప్పుడూ విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నా.. ఇప్పటికీ విమాన ప్రయాణం చాలామందికి కలగానే మిగిలిపోయింది. అయితే ఈ కొత్త రకం విద్యుత్ విమానం కేవలం.. 694 రూపాయలతో 130 కిలోమీటర్లు ప్రయాణించినట్టు అమెరికా విమానయాన కంపెనీ ప్రకటించింది. హెలికాప్టర్‌కు అయ్యే ఇంధనం ఖర్చు కంటే తక్కువలోనే ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణించింది. ఈ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విమాన ప్రయాణ ఖర్చు చాలావరకూ తగ్గిపోతుంది. అందరికీ విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.