ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులను చంపేసిన మావోయిస్టులు పై ప్రతీకారం తీర్చుకున్న పోలీసులు జోన్ స్థాయి మావోయిస్టు నేతలను ఎదురు కాల్పుల్లో కాల్చిచంపేసారు. మొన్నటి ఘటనలో ఏఎస్పీ మృతి పై సీరియస్ ఫోకస్ పెట్టిన పోలీసులు కూంబింగ్ ఉదృతం చేసారు. తెల్లవారుజామున ఏలూరు రేంజ్ పరిధిలో అల్లూరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఎదురు కాల్పుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు గాజర్ల రవి, అరుణ మృతి చెందారు. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది ఘటన స్థలంలో ఏకే 47 లభ్యం అయింది. ఈ తెల్లవారుజామున కాల్పులు ఘటన జరిగిందని చెబుతున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం తో కూంబింగ్ చేపట్టిన పోలీసులుకు వీరు దీంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న ఎదురు కాల్పులు..

