22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

క్రిస్టియన్ గా మారి ఎస్సీ అంటే కుదరదు..

మతం మారిన తరువాత కూడా అంతకు ముందు కులంతో హక్కులు, సౌకర్యాలు పొందాలనుకుంటే చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం పుచ్చుకొని , మళ్ళీ తనకు ఎస్సీ జాబితాలోనే రిజర్వేషన్, ఇతర ప్రయోజనాలు కావాలంటే వీలుకాదని , ఇది రాజ్యాంగాన్ని , రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతం పుచ్చుకున్న తరువాత , అతడు క్రైస్తవుడేనని , అంతకు ముందు కులం వర్తించదని చెప్పింది. ఏ రోజు అయితే మతం మారుతారో ఆ రోజే ఇంతకుముందు ఉన్న అవకాశాలు, హక్కులు కోల్పోతారని తెలిపింది.

పిట్టలవారిపాలెం , కొత్తపల్లికి చెందిన చర్చి పాస్టర్ ఆనంద్ , గ్రామంలోని అగ్రకులాలకు చెందిన ఐదుగురిపై ఎస్సీఎస్టీ చట్టంకింద కేసు నమోదు చేసారు. తనను కులంపేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు. తానూ ఎస్సీ కులానికి చెందిన వాడినని కూడా పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఉంది. దీన్ని కొట్టివేయాలని రామిరెడ్డి అనే నిందితుడు హైకోర్టులో పిటీషన్ వేశారు.

దీన్ని విచారించిన హైకోర్టు, క్రెస్తవ మతంలోకి మారిన తరువాత , చర్చి పాస్టర్ ఆనంద్ కి తాని ఎస్సీ నని చెప్పుకునే హక్కులేదని స్పష్టం చేసింది. ఎస్సీ ముసుగులో చర్చి పాస్టర్ ఆనంద్ చేసిన ఆరోపణచెల్లదని, ఎస్సీఎస్టీ చట్టంకింద పెట్టిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తెలిపింది. పోలీసులు కూడా ఈ విషయంలో తొందరపడ్డారని , కేసు నమోదు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.