తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ బృందం దర్శించుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇస్రో సంయుక్తంగా తయారుచేసిన నిసర్ ఉపగ్రహాన్ని 30 వతేది ప్రయోగించనున్న సందర్భంగా , శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకున్నారు. ఇస్రో నుంచి ఎప్పుడు ఉపగ్రహ ప్రయోగాలు జరిగినా తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ.నిసర్ ఉపగ్రహంలో రెండు ముఖ్యమైన పేలోడ్స్ ఉంటాయి. ఈ శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
జీఎస్ఎల్వీ మార్క్-2 రాకేష్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. 30 వతేది సాయంత్రం 5.40 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది భూ ఉపరితలం పరిశీలన, ఉపద్రవాల హెచ్చరికలు, అనేక రకాలుగా ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది .12 రోజుల్లో భూమి మొత్తము చుట్టేస్తుంది.. శాటిలైట్ ద్వారా వచ్చే డేటా ను గ్లోబల్ కమ్యూనిటీ వెల్ఫేర్ కు ఉపయోగపడుతుందని తెలిపారు.

