దేవుడా భారతదేశం నుంచి నా పాకిస్తాన్ ని కాపాడు నా పాకిస్తాన్ ప్రజలను రక్షించు అంటూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఓ ఎంపి విలపించాడు. తాహీర్ ఇక్బాల్ అనే ఈ ఎంపీ గతంలో ఆర్మీ అధికారిగా కూడా పనిచేశాడు. అతడిని మేజర్ తాహీర్ అని పిలుస్తారు. భారతదేశం, పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేస్తూ దాడులచేయడంతో ఆయన ఏడ్చేశారు. పాకిస్తాన్ కు ,భారతదేశం నుంచి ముప్పుతుందన్నారు. దేశాన్ని కాపాడండి , కాపాడండి విలపిస్తూ పార్లమెంట్లో మాట్లాడిన మాటల ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ , భారత్ లోని కీలక స్తావరాలపై చేసిన దాడుల ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని 15 స్థావరాలు పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ డ్రోన్లను పంపించింది . అయితే మానవ రహిత గగనతల రాకెట్లను పంపి మన సైన్యం వాటిని నిర్వీర్యం చేసింది. అవంతిపురం, శ్రీనగర్, జమ్ము ,పఠాన్ కోట ,అమృత్సర్, కపూర్తల ,జలంధర్, లూథియాన ,ఆదంపూర్, బటిండా , చండీగర్, నాల్ అలోడి, ఉత్తరాలై మరియు బుజ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు చేసేందుకు డ్రోన్లను పంపింది .
అయితే వీటిని భారత్ గగనతలం లోనే నిర్వీర్యంచేసి కూల్చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టంను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ,దాడుల ప్రయత్నాలకు అనుగుణంగానే ఇలా సమాధానం చెప్పామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మేస్త్రి అన్నారు. ఉగ్రవాదం ఏ భూభాగంలో నుంచి అయినా సరే సహించే ప్రశ్న లేదని అందుకే దాడులు చేశామని స్పష్టం చేశారు.

