22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

వందేళ్ల ఈ బ్రిడ్జి చూస్తే సిగ్గెయ్యదా ?

గత కాలం నాటి ఇంజనీర్ల మేధస్సుకు, ఆనాటి వస్తువుల నాణ్యతకు, పనిలో నిజాయితీకి ఇదిగో ఈ ఐరన్ బ్రిడ్జి ఒక నిదర్శనం. 1930 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో నాయుడుపేట సమీపంలో చెన్నై , తిరుపతి వైపునకు సువర్ణముఖి నదిపై దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ బ్రిడ్జి ఇనుప స్తంభాలతో నిర్మించారు . అప్పటి వెంకటగిరి జమీందార్ దీన్ని ప్రారంభించారు. సున్నము, బండ రాళ్లతో కట్టిన దిమ్మలపై ఇనుప దూలాలు పెట్టి నిర్మించారు . దానిపై రోడ్డు వేశారు. ఇప్పటికీ 95 సంవత్సరాలు పూర్తయిన ఈ బ్రిడ్జి మాత్రం నేటికీ చెక్కుచెదరలేదు.

అయితే దీనికి కాలం చెల్లిందని సమీపంలోనే మరో బ్రిడ్జి నిర్మించారు. ఆ బ్రిడ్జి సగం కట్టిన తర్వాత నాలుగు స్పాన్ లు కూలిపోయాయి. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా కూలదోసి అదే స్థానంలో మళ్ళీ కొత్త బ్రిడ్జి కట్టారు. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆ నిర్మాణం జరిగింది. ఈ ఐరన్ బ్రిడ్జి మాత్రం 95 ఏళ్ల నుంచి అలాగే చెక్కుచెదరకుండా ఉంది. ఇది ఆనాటి కట్టడాలకు నేటి కాంట్రాక్టర్లు ఇంజనీర్ల కట్టడాలకు ఉన్న తేడా.. ఇప్పటికి కూడా ఇనుము తుప్పు పట్టకుండా ఉందంటే నిజంగా చాలా గొప్ప విషయం .

ఇప్పుడు ప్రభుత్వ భవనాల్లోనూ ఇతర కార్యక్రమాలలో వాడే స్టీలు 15 నుంచి 20 సంవత్సరాలు తర్వాత తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది. కానీ బయటే ఉన్న ఈ స్టీలు 95 ఏళ్లగా అలాగే ఉంది. మరో వందేళ్ళ కూడా ఇలాగే నిలబడి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని జాగ్రత్తగా కాపాడి వీటిని ఇంజనీరింగ్ విద్యార్ధులకు, భావితరాలకు ఒక పాఠంగా చెప్పగలిగితే ,ఆదర్శంగా నిలపగలిగితే మంచిది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.